ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.
