ఆసుపత్రి తీసుకెళ్ళేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కరీముల్ హాక్ అనే పశ్చిమబెంగాల్ చెందిన కార్మికుడు తన తల్లిని కోల్పోయాడు. దీంతో తన తల్లికి జరిగినట్లు మరెవ్వరికీ అవ్వొద్దని ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైకును అంబులెన్స్ గా మార్చుకుని స్వగ్రామం దళబరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తక్షణ సేవలు అందిస్తూ 7వేల కంటే ఎక్కువ మందిని ఆయన కాపాడారు. దాంతో ఆయనకు 2017లో పద్మశ్రీ వరించింది.
