లోక్సభ నిరవధిక వాయిదా పడింది. బీజేపీ నేతృత్వంలోని NDA, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ పార్లమెంట్ వెలుపల నిరసనలు చేపట్టాయి. దీంతో లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
