తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో సమస్యల పై ఆందోళనలు, ఫార్ములా-ఈ రేసు అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతుందని మండిపడ్డారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కెటిఆర్ పై కేసు అక్రమమని ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ.. 420 గ్యారంటీలు ప్రశ్నిస్తే మా పై అక్రమ కేసులా? అని నినాదాలు చేశారు.
