రాజస్థాన్ లో జైపూర్ లోని ఒక పెట్రోల్ బంకులో ఘోర ప్రమాదం ఐదుగురు మృతి. తెల్లవారు జామున జైపూర్ – అజ్మీర్ జాతీయ రహదారిపై ఎల్పీజీ ట్యాంకర్ ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో పెట్రోలు బంకులకు మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనలో 37 మంది గాయపడ్డారు. అయితే వెంటనే పెట్రోల్ బంకు యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఇరవై ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పెట్రోలు బంకు నుంచి పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.