హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ.. నేపాల్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్

హాస్టళ్లలో ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నేపాల్‌కు చెందిన గోవింద్‌ భండారి(24), హిక్‌మత్‌ రావల్‌(23) అనే ఇద్దరిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 51 సెల్‌ఫోన్లను(10,20,000 విలువ) స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ పి.వెంకటరమణ ప్రత్యక్ష పర్యవేక్షణలో, అసిస్టెంట్. కమీషనర్ ఆఫ్ పోలీస్, ఎస్‌ఆర్ నగర్ పి.ఎస్.కి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి.శ్రీనాథ్ రెడ్డి మరియు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.గోపాల్, ఎస్‌ఐ శ్రీ వై సూరజ్ సహాయంతో నిందితులను అరెస్టు చేసి వివరాలను తెలిపారు.

వివరాల్లోకి వెళితే..
గోవింద్‌ భండారి, హిక్‌మత్‌ రావల్‌లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో హాస్లళ్లలో సెల్‌ఫోన్లను చోరీ చేసి రాత్రయ్యాక ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకుని ఆ సెల్‌ఫోన్లన్నీ నేపాల్‌ దేశానికి తీసుకెళ్లి విక్రయించాలని అనుకున్నారు. కాగా.. సెల్‌ఫోన్ల చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించగా.. బైక్ నెంబర్ ట్రేస్ చేయగా హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌కు వారిద్దరు చేరుకోగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 51 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News