కేరళలో మంకీపాక్స్ మళ్లీ కలకలం రేపుతుంది. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికి మంకీపాక్స్ నిర్దారణ అయింది. దీంతో ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. వారి నమూనాలను పరీక్షల కోసం పంపగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
