హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరేందుకు ముహూర్తం ఖరారైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈనెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.430 కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ స్టేషన్లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్లు, 6 బుకింగ్ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కూడా కల్పించనున్నారు.
