ప్రధాని మోదీ ఈ నెల 21, 22 తేదీల్లో కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సభా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సందర్శించనున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. నాలుగు దశాబ్దాల్లో కువైట్లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు.
