ముంబయిలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్కు వెళ్తున్న ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొట్టింది. బోటు మునిగి పలువురు పర్యాటకులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సుమారు 70 మందిని రెస్క్యూటీం రక్షించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారని, 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
