వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ.. విడుదల తేదీ ఎప్పుడంటే?

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జనవరి 10న నిర్వహించనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శన సౌకర్యం కల్పించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది.

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.3000 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News