తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జనవరి 10న నిర్వహించనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శన సౌకర్యం కల్పించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది.
ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.3000 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.