మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ గొల్ల కొమరయ్య కాలనీలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రధానంగా నిత్యం ఎంతో రద్దీగా ఉండే గొల్ల కొమరయ్య కాలనీలోని ప్రధాన రహదారి పై స్పీడ్ ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమిటీ హాల్ పై మరో అంతస్తు నిర్మాణం చేపట్టాలని కోరారు. స్పందించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కమిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. కమిటీ హాల్ లోని మోటార్ పని చేయడం లేదని, నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు MLA ను కోరగా సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీలో స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని చెప్పగా లైట్ల ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వాసులు నల్లా కనెక్షన్ ఇప్పించాలని కోరగా, వెంటనే నల్లా కనెక్షన్ కల్పించి నీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంతోనే తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో బోయగూడ కమాన్ నుండి మల్లన్న గుడి వరకు ఎంతో అద్వాన్నంగా ఉన్న రోడ్డు ను అద్భుతంగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాననే విషయం నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలిసిందే అన్నారు. MLA వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, DC సమ్మయ్య, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ DGM ఆశిష్, ఎలెక్ట్రికల్ AE, స్ట్రీట్ లైట్ AE అనూష, BRS పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, కాలనీ కార్యదర్శి నర్సింగ్, మనీష్, వినోద్, కుమార్ యాదవ్, శంకర్, జనార్దన్, గజ్జెల శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.