ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు నమోదు కావచ్చని సూచనలున్నాయి. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది.
