సంధ్య థియేటర్కు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తోక్కిసలాట ఘటనలో 12 లోపాలు గుర్తించిన పోలీసులు, థియేటర్ యాజమాన్యాన్ని వివరణ ఇవ్వాలని కోరారు. ఈనెల 22లోగా వారు ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని సూచించారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో థియేటర్ యాజమాన్యం విఫలమై, నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు, ఇంకా మరొకరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
