హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చబోమని స్పష్టం చేశారు. కూకట్ పల్లి లోని కాముని చెరువు, మైసమ్మ చెరువు లాంటి ప్రదేశాలను పరిశీలించిన అనంతరం, “జూలై తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలను మాత్రం ఖచ్చితంగా కూల్చిపెడతాం” అని ఆయన తెలిపారు.
అలాగే హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, పేదల ఇళ్లను కూల్చడం జరుగుతుందని భావించకండి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తోంది అని చెప్పారు. ఇటువంటి చర్యలు పేద ప్రజలపై భారం కాకుండా, చెరువుల పరిరక్షణకి ప్రాధాన్యం ఇస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.