దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం 237 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో గరిష్టంగా 1136 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. చివరికి 1064 పాయింట్ల నష్టంతో 80,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 332 పాయింట్ల నష్టంతో 24,336 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50లో సిప్లా మినహా మిగతా స్టాక్స్ అన్ని నష్టాలను చవిచూశాయి.
