స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా 13,735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభంకాగా.. 2025 జనవరి 7వ తేదీతో ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్స్ పరీక్ష మార్చి/ఏప్రిల్లో జరగనుంది. దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
