అమరావతి హైకోర్టులో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్లో చెవిరెడ్డి, పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదుచేసిన కేసును రద్దు చేయాలని కోరారు. కోర్టు, పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 24 డిసెంబరుకు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ విషయంలో కోర్టు, అరెస్టు నుండి రక్షణ ఇవ్వడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని స్పష్టం చేసింది.
