టీజీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ముగిశాయి. ఉదయం నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను 8,915 మంది హాజరయ్యారు. 10,940 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 8,911 మంది పరీక్ష రాయగా.. 10,944 మంది గైర్హాజరయ్యారు. మొదటి రోజుతో పోలిస్తే రెండోరోజు మరింత హాజరు శాతం తగ్గింది.
