హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాటాలను స్మరించుకున్నారు. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.
