చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వహించాలని సూచించారు.
స్కూళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాం. వారానికి ఒకసారి రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.