భారత షట్లర్ పీవీ సింధు, తన కాబోయే భర్త వెంకట దత్త సాయితో డిసెంబర్ 14న నిశ్చితార్థం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను సింధు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీరి వివాహం డిసెంబర్ 22న ఉదయపూర్లో జరగనుంది. ఈ వేడుకకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. వెంకట దత్త సాయి ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
