మంచు విష్ణు మరో దశలో అడుగు పెడుతున్నారు. ఆయన “తరంగ వెంచర్స్” పేరుతో మీడియా, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో ప్రవేశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు 50 మిలియన్ డాలర్ల నిధులు కల్పించనున్నారు. ఈ సంస్థలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్స్మిత్ కూడా భాగస్వామిగా చేరే అవకాశం ఉందని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు, వీరి మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన శుభవార్త త్వరలో వింటారు అని విష్ణు తెలిపారు.
