RBI రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగుకోసం ఎలాంటి తాకట్టులేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈరుణసదుపాయం రూ.1.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 2 లక్షలకు పెంచింది. ఈనిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీబీ ప్రకటించింది.
