సొంత గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని సతీమణి జయసుధ శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోరారు.
ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతం లోకి వెళ్లినట్లు సమాచారం రావడం కలకలం రేపుతోంది. అధికారులు ఇంకా వారి ఆచూకీ గుర్తించలేకపోతున్నారు, ఇది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది .