నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి లాటరీ మోసానికి గురయ్యాడు. ఫేస్బుక్లో లాటరీ యాడ్ క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్ల మాయలో పడ్డాడు. 60 లక్షల రు. నగదు, 10 తులాల బంగారం గెలిచినట్లు చెప్పి ట్యాక్స్ కింద 7.2 లక్షలు చెల్లింపుచేయించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసమని గ్రహించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
