హైదరాబాద్లోని మియాపూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగలక్ష్మి, కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి తాగి ప్రాణాలు కోల్పోయింది. గత ఐదు నెలల క్రితం, కాంట్రాక్టర్ మనోజ్తో ఆమె వివాహం జరిగింది. కానీ కుటుంబలో సమస్యలు పెరిగాయి, దాంతో కలహాలు ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
