ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్గ్రేడేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్గ్రేడేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పోర్టల్ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
