మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ YCP నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకూ రాజీనామా చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించిన అవంతి, ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . రాజకీయాలకు విరామం తీసుకోవాలని, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.










