నటి కీర్తి సురేష్ నేడు తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ని వివాహమాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లో రెండు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయంతో వివాహం జరిగింది. కీర్తి తన సినిమాల షూటింగ్స్ పూర్తి చేసి, కొంత గ్యాప్ తీసుకొని, వైవాహిక జీవితం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆంటోనీతో మేడలో మూడు ముళ్ళు వేసిన కీర్తి, “నీవే నా గమ్యం” అనే భావనతో ఆనందంగా తన జీవిత సాహసంలో కొత్త దారిని ప్రారంభించారు. ఈ వివాహానికి సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు.
