తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే చిల్లర సమస్యలు తీరనున్నాయి. బస్సులో ఆన్లైన్ పేమెంట్ కోసం RTC ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పద్ధతిని మొదట హైదరాబాదులో పరిశీలించనుంది. ఇప్పటికే ఆర్టీసీ సంస్థకు 6వేల ఆటోమేటిక్ పేర్ కలెక్షన్ మెషిన్లు అందాయి. ప్రస్తుతం దూర ప్రాంతాల రుట్లలో ఉండగా, ఇప్పుడు పల్లె వెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లో ఉపయోగించనున్నారు.
