రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏపీ జితేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అధ్యక్ష పీఠానికి ఏపీ. జితేందర్ రెడ్డికి, మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్ పోటీపడ్డారు. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి చాముండేశ్వరనాథ్పై 34 ఓట్ల తేడాతో గెలుపొందారు.
