తమిళనాడు మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తిక్ అనే మాజీ సైనికుడు రజనీకాంత్పై ఉన్న తన అనేక సంవత్సరాల వీరాభిమానాన్ని వ్యక్తపరుస్తూ అతని కోసం ప్రత్యేకంగా ఓ దేవాలయం నిర్మించాడు. ఈ ఆలయానికి “అరుల్మికు శ్రీ రజినీ దేవాలయం” అని నామకరణం చేసి, ఇందులో 250 కిలోల బరువు, 3 అడుగుల ఎత్తున్న రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ రోజు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ప్రతి సంవత్సరం ఈ రోజు “రజనీ చతుర్థి”గా జరుపుకుంటామని కార్తీక్ ప్రకటించారు.
