ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31వ‌తేదీ లోగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ అప్లికేషన్‌ల సర్వే పై ప్రతిరోజు కలెక్టర్లు సమీక్షించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News