EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి. కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, EPF చందాదారులు త్వరలోనే ఏటీఎం ద్వారా తమ PF సొమ్మును నేరుగా ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. 2025 జనవరి నాటికి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి అని సుమిత దావ్రా తెలిపారు. అంతేకాక, క్లెయిమ్లను వేగంగా పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
