కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, రాహుల్ గాంధీకి లేఖ రాశారు. చేతకాని సీఎంను తెలంగాణ నెత్తిన రుద్దారు, కాంగ్రెస్ చేతకాని నాయకత్వం తెలంగాణను నాశనం చేసిందని, హామీలకు పత్తా లేదు డిక్లరేషన్లకు అడ్రస్ లేదు అని విమర్శించారు. తెలంగాణ ప్రజల బతుకులు ఛిద్రం అవుతున్నా రాహుల్ గాంధీ ప్రేక్షక పాత్రలోనే ఉన్నారని ఆరోపించారు. అన్నదాతల నుంచి మహిళల వరకు ప్రతీ ఒక్కరూ బాధితులుగా ఉన్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధమా? అంటూ ప్రశ్నించారు.
