నటుడు మోహన్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. కుటుంబ వ్యవహారానికి సంబంధించి పోలీసులు మోహన్బాబును విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చిన కోర్టు, మోహన్బాబు ఇంటి దగ్గర ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. ప్రతి రెండు గంటలకోసారి మోహన్బాబు నివాసాన్ని పర్యవేక్షించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది
