బాలీవుడ్ దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీ తో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న ఆర్కె ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనాల్సిందిగా వారు మోదిని ఆహ్వానించారు. అందుకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు మోదీని కలిశారు. ఆర్కె ఫిలిం ఫెస్టివల్ 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు 40 నగరాల్లో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.
