కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు, 1999 నుంచి 2004 వరకు ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు మహారాష్ట్ర గవర్నర్గా పని చేశారు. అనంతరం అంటే 2009లో మన్మోహన్ సింగ్ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్ ఎం కృష్ణ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందానని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
