తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో చారిత్రాత్మక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. నిర్దేశించిన సుముహూర్థం మేరకు సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని సీఎం సన్మానించారు.
