జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏపీ కేబినెట్లో చేరనున్నారు. త్వరలో జనసేన తరఫున మంత్రి కానున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్లో చోటు దక్కింది. ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆ ఒక్క స్థానం జనసేన నుంచే భర్తీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.