పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలతో సోమవారం సమావేశాలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై లోక్సభలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
