రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాను వచ్చే వారం టీడీపీలో చేరనున్నట్లు
ప్రకటించారు. ఈరోజు ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మరో వారం రోజుల తరువాత టీడీపీలో జాయిన్ అవుతానని ప్రకటించారు.
