ధరణిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ధరణి సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. ధరణి నిర్వహణను విదేశీ సంస్థ నుంచి ఎస్ఐసీకి మార్చామని అన్నారు. లోపాలు సరిచేసి ఆర్వోఆర్ చట్టం 2024 తెస్తున్నామని చెప్పారు. కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
