ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్ దానిని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలను మార్చడం సరికాదు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఉద్యమం ద్వారా తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి అని నేతలతో ఆయన సూచించారు.