హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర బైక్లు తగలబెట్టిన ఘటనలో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని జకీర్ అలియాస్ బాంటా అని గుర్తించారు. జకీర్ గతంలో కూడా ఇలాగే బైక్లను తగలబెట్టినట్లు స్పష్టమైంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
