మాజీ మంత్రి, BRS నేత జగదీష్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కెసీఆర్ పూర్తి చేసిన పనులను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. కొత్తగా శంకుస్థాపనలు చేసే దమ్ములేదా అని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తిగా BRS ప్రభుత్వ హయాంలోనే నెరవేర్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, SLBC ప్రాజెక్ట్ ఆలస్యానికి ఎవరు కారణమో త్వరలో వెల్లడిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ తల్లి విగ్రహం వాళ్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు అంటూ ఆయన స్పష్టం చేశారు.