సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీకెండ్ నుంచి ‘పుష్ప2’ టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 , ఫస్ట్ క్లాస్ 250 ప్లస్, సెకండ్ క్లాస్ 150 ప్లస్ ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా నిన్న రాత్రి జరిగిన ‘పుష్ప2’ సక్సెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అందరూ టికెట్ రేట్ ఏదో 800.. 800 అనుకుంటున్నారని, కానీ ఆ ధర కేవలం ప్రీమియర్ షో వరకూ మాత్రమే ఉందని చెప్పారు. ఆ ఒక్క షోకే 800 ఉందని, అది అయిపోయిందని.. ఇక నుంచి అందుబాటు ధరలోనే పుష్ప–2 టికెట్స్ ఉంటాయని నిర్మాత చెప్పారు.