మంచు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మంచు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తండ్రి తనయుడు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారని వచ్చిన వార్తలపై మంచు ఫ్యామిలీ రెస్పాండ్ అయింది. ఈ మేరకు ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఎవిడెన్స్లు లేకుండా అసత్య ప్రచారాలను చేయవద్దని ప్రకటన రిలీజ్ చేసింది.
