యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదాయం

కార్తీక మాసంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాసుల వర్షం కురిసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆలయ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2024 సంవత్సరంలో ఆలయానికి రూ. 18,03,40,051 ఆదాయం సమకూరింది, ఇది 2023లో నమోదైన రూ. 15,08,36,661 ఆదాయంతో పోలిస్తే రూ. 2.95 కోట్లు ఎక్కువ.

విభిన్న విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం:

కల్యాణకట్ట: రూ. 20.09 లక్షలు
ప్రధాన బుకింగ్: రూ. 76.20 లక్షలు
బ్రేక్ దర్శనలు: రూ. 81.01 లక్షలు
వ్రతాలు: రూ. 1.86 కోట్లు
వాహన పూజలు: రూ. 3.75 లక్షలు
వీఐపీ దర్శనలు: రూ. 1.07 కోట్లు
శీఘ్ర దర్శనలు: రూ. 1.72 కోట్లు
ప్రచార శాఖ: రూ. 32.21 లక్షలు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News